నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగులతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే.. తాను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ అభివృద్ధిని కూడా సినిమాల్లాగే పరుగులు పెట్టిస్తున్నారు. అయితే.. తాను సినిమా షూటింగుల్లో తీరిక లేకుండా ఉండటంతో.. రంగంలోకి తనకు బదులుగా తన సతీమణి వసుంధరను దింపారు బాలయ్య. తాను స్వయంగా వెళ్లలేకపోయినా తన భార్యను ప్రజల్లోకి పంపించి.. తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. స్థానిక సమస్యలను పరిగణలోకి తీసుకుని పలు అభివృద్ధి పనులు తలపెట్టగా.. వాటిని వసుంధర దేవి ద్వారా ప్రారంభించి.. ప్రజల్లోకి కొత్త సంకేతాలు పంపించారు బాలకృష్ణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో వసుంధర పాల్గొన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా.. నియోజకవర్గ మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఇంటింటికి వెళ్లిన వసుంధర.. సంక్షేమ పథకాల అమలుతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి మాట్లాడుతూ.. బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే.. నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు. హిందూపురం అభివృద్ధిపై ఈ నెల 31వ తేదీన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులతో కలిసి చర్చించనున్నారని తెలిపారు. గోళ్లపురం పారిశ్రామికవాడలో విద్యుత్తు సమస్య గతంలో ఉండేదని.. బాలకృష్ణ ఈరోజు ఆ సమస్య లేకుండా చేశారని.. ఈ ప్రాంతంలో శుక్రవారం రోజు మహాలక్ష్మి వచ్చినట్టే విద్యుత్ వెలుగులు వస్తున్నాయి.. ఆ మహాలక్ష్మిని బాలకృష్ణ తీసుకొచ్చారు అని అభివర్ణించారు.ఆగస్టు 15 ఇండియన్స్ని స్వాతంత్య్రం వచ్చిందని.. ఇప్పుడు అదే రోజు ఏపీ మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో స్వాతంత్రం వచ్చిందంటూ వసుంధర చెప్పుకొచ్చారు. మరోవైపు తన వృత్తిలో ఉంటూ హైదరాబాద్లో బసవకతారకం కాన్సర్ హాస్పిటల్పై బిజీగా వర్క్ చేస్తున్నారు అని వసుంధర పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa