ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి దర్శనం విధానంలో టీటీడీ మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 06:58 PM

శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శనం విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్‌పై దర్శనానికి మూడు రోజులు పడుతుండగా.. ఇకపై ఏ రోజు టికెట్‌ తీసుకుంటే ఆరోజే దర్శనానికి టీటీడీ వీలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఉదయం శ్రీవాణి టికెట్‌ పొందిన భక్తులు.. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa