ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25 ఏళ్ల క్రితం కొన్న స్ల్పెండర్ బైక్ మీద తండ్రీ కొడుకుల లడఖ్ టూర్.. ‘హీరో’ నుంచి ఊహించని గిఫ్ట్

national |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 08:08 PM

కొన్ని వార్తలు, కొందరి కథలు ప్రతీ ఒక్కరి మనసును హత్తుకుంటాయి. అందులోనూ అమ్మ ప్రేమ, తండ్రి ప్రేమల గురించి వచ్చే స్టోరీలు అయితే మరింత స్పెషల్‌గా నిలుస్తుంటాయి. అచ్చంగా అలాంటి కథ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 25 ఏళ్ల క్రితం కొన్న ఓ పాత స్ప్లెండబ్ బైకుపై.. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి కర్ణాటక నుంచి ఏకంగా లడఖ్‌ వరకు వెళ్లారు. రోడ్లు కూడా సరిగ్గా లేని ప్రాంతంలో.. చాలా తక్కువ ఖర్చుతో వీరిద్దరూ అక్కడి వరకు వెళ్లడంతో వార్త వైరల్ అయింది. ఈ విషయం తెలుసుకున్న "హీరో".. వారికి ఓ అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. ముఖ్యంగా 13 లక్షల రూపాయల విలువ చేసే గిఫ్టిచ్చి దేశవ్యాప్తంగా వారిని మరింత వైరల్ అయ్యేలా చేసింది.


కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఇద్దరు తండ్రీకొడుకులు.. సుదూర ప్రయాణం చేయాలనుకున్నారు. ముఖ్యంగా ఈ అసాధారణ ప్రయాణం.. సాహసం, తండ్రీకొడుకుల బంధానికి ప్రతీకగా నిలిచింది. ఒక తండ్రి తన కొడుకుతో కలిసి సుదూర ప్రాంతానికి.. అది కూడా పాతబడిన బైక్‌పై వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడమే ఒక గొప్ప విషయం కాగా.. ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ఆ అనుభూతులు, వారి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. లడఖ్ చేరుకోవడానికి వారు పడిన శ్రమ, బైక్ పని తీరుపై వారికి ఉన్న నమ్మకం, వారి సంకల్పానికి నిదర్శనంగా నిలిచాయి. ఆధునిక బైక్‌లు అందుబాటులో ఎన్నో ఉన్నప్పటికీ.. వీరు తమ పాత పాతికేళ్ల నాటి స్ప్లెండర్ బైకునే ఎంచుకున్నారు.


ఎక్కువ మైలేజ్ ఇవ్వడం, కూర్చోవడానికి కూడా ఇద్దరికి చాలా కంఫర్ట్‌గా ఉండడంతో.. వీరి ప్రయాణం చాలా సులువుగా సాగింది. అయితే వీరు చేసిన ఈ అద్భుత ప్రయాణం హీరో మోటోకార్ప్ దృష్టిని ఆకర్షించింది. తమ దశాబ్దాల నాటి బైక్‌పై అంతటి సాహసయాత్ర చేసిన ఆ తండ్రీకొడుకులను చూసి.. తమ బండిపై వారికి ఉన్న నమ్మకాన్ని గుర్తించి మంత్రముగ్ధులు అయ్యారు. వెంటనే వారి వద్దకు వెళ్లి తండ్రీకొడుకులను కలిశారు. వారితో మాట్లాడి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకున్నారు. అక్కడితో ఆగకుండా.. వారి వద్ద ఉన్న పాత స్ల్పెండర్ బైకును కొనుగోలు చేసి దాని స్థానంలో దాదాపు 13 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక సూపర్‌బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.


అయితే ఇది కరిజ్మా XMR ఆధారంగా రూపొందించబడిన సెంటెనియల్ ఎడిషన్ మోటార్ బైక్. హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ 101 జయంతిని పురస్కరించుకుని రూపొందించారు. కేవలం 100 బైకులు మాత్రమే ఉత్పత్తి చేయగా.. 75 వాహనాలను వేలం వేశారు. దీని వల్ల సంస్థకు రూ.8.6 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మిగతా 25ను మాత్రం హీరోకు అంతర్గతంగా పంపిణీ చేశారు. ఈ పాతిక బైకుల్లోంచే ఒక దాన్ని సదరు సంస్థ తండ్రీకొడుకులకు బహుకరించింది. నేరుగా వారిద్దరినీ హీరో షోరూమ్‌కు పిలిచి మరీ అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa