ఈజీ మనీకి అలవాటు పడ్డ వారు.. అందుకోసం ఎలాంటి అరాచకాలకు పాల్పడటానికి కూడా వెనకాడటం లేదు. పైగా ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిలో ఆడ, మగా అనే తేడా ఉండటం లేదు. ఈమధ్య కాలంలో తీవ్ర నేరాలకు పాల్పడుతన్న వారిలో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ మహిళ.. స్వయంగా తన బాయ్ఫ్రెండ్నే కిడ్నాప్ చేసింది. ఏకంగా 2.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరు అశోక్ నగర్ పోలీసులు తాజాగా ఓ కిడ్నాప్ కేసును చేధించి.. 37 ఏళ్ల వ్యక్తిని కాపాడారు. బాధితుడిని లారెన్స్ మెల్విన్గా గుర్తించారు. అతడు దుబాయ్లోని ఓ ట్రావెల్ సంస్థలో మేనేజరుగా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే తన స్వస్థలం అయిన బెంగళూరు వచ్చాడు. ఈక్రమంలో జులై 16 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు లారెన్స్ కోసం గాలించారు.. కానీ లాభం లేకుండా పోయింది. ఈలోపు వారికి కొందరు వ్యక్తులు కాల్ చేసి.. లారెన్స్ని కిడ్నాప్ చేశామని.. 2.5 కోట్ల రూపాయలు ఇస్తేనే అతడిని వదిలేస్తామని బెదిరించారు. దీంతో లారెన్స్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహారం, డబ్బులు డిమాండ్ చేసిన దాని గురించి తెలిపింది.
కేసు నమోదు చేసుకున్న అశోక్నగర్ పోలీస్లు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లారెన్స్ గర్ల్ఫ్రెండే అతడిని కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బయటకు వెళ్దామని లారెన్స్ గర్ల్ఫ్రెండ్ మహిమా కోరడంతో.. బాధితుడు జులై 14న ఓ కారు బుక్ చేసుకొని ఆమెతోపాటు బయటకు వెళ్లాడు. అలా వారు కొంతదూరం వెళ్లాక డ్రైవరు కారును దారి మళ్లించాడు. ఇది గమనించిన లారెన్స్ దీని గురించి డ్రైవర్ని ప్రశ్నించాడు. ఇలా ఉండగానే మరో చోట.. ఇంకో ఇద్దరు వ్యక్తులు కారులోకి ఎక్కారు.
ఆపై వారు లారెన్స్ మీద దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.లక్ష లాక్కొన్నారు. ఆ తర్వాత లారెన్స్ని ఓ అపార్ట్మెంటుకి తీసుకెళ్లి అక్కడ బంధించారు. దాదాపు ఎనిమిది రోజులు అతడిని చిత్రహింసలకు గురిచేశారు. లారెన్స్ కుటుంబసభ్యులకు కాల్ చేసి.. అతడిని కిడ్నాప్ చేశామని.. తమకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలో లారెన్స్ని బంధించిన అపార్ట్మెంట్లో ఉండే ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని లారెన్స్ని రక్షించారు. అతడిని కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన కుట్రదారు మహిమా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa