అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు ఆరంభానికి ముందే అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. జట్టును ముందుగానే ప్రకటించిన ఇంగ్లండ్ అందరూ అవాక్కయ్యేలా చేసింది. బెన్ స్టోక్స్, జోఫ్రాతో సహా మొత్తం నలుగురికి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. మార్పులు చేసిన జట్టులో కూడా కనీసం ఒక్క స్పిన్నర్ని కూడా తీసుకోలేదు. దీంతో టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయబోతోందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రాను పక్కనబెట్టనున్నారన్న వార్తలు టీమిండియాలో వినిపిస్తున్నాయి. అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చినప్పటికీ అరంగేట్రం మ్యాచ్లోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పేస్ బౌలింగ్కు అనుకూలించే ఒవెల్ పిచ్పై అర్షదీప్ సింగ్ ఎంట్రీ అనివార్యంగా కనిపిస్తోంది. ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్షదీప్ సింగ్ ఆఖరి టెస్టుతో డెబ్యూ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో టెస్టుకు ముందు గాయపడిన ఆకాశ్ దీప్ ఐదో టెస్టులో అడుగుపెట్టనున్నాడు.
మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్ ముగ్గురు పేసర్లే ఇప్పుడు టీమిండియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆల్రౌండర్ శార్థూల్ ఠాకూర్ ఉన్నప్పటికీ బౌలింగ్లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పుడు టీమిండియా ఈ ముగ్గురు బౌలర్లనే తీసుకోనుందా? లేక మరో పేసర్గా ప్రసిద్ను బరిలోకి దించనుందా? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు కుల్దీప్ యాదవ్ను కూడా జట్టులోకి తీసుకోవాలనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
ఒవెల్ వేదికగా ఇంగ్లండ్ - ఇండియా మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్లో 2 - 1తో ఇంగ్లండ్ జట్టు లీడింగ్లో ఉండగా.. ఎలాగైనా ఆఖరి టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భారత్ చూస్తుంటే.. ఆఖరి టెస్టులో గెలిచో, డ్రా చేసో సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ గట్టి పట్టుదల మీద ఉంది.
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఎవ్వరూ ఊహించని రీతిలో ఆడి డ్రా చేసింది. బౌలర్లు విఫలమైన ఆ టెస్టులో టీమిండియా బ్యాటర్లలో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేసి ఇంగ్లండ్కు చెమటలు పట్టించారు. ఐదో రోజు భారత్ను ఆలౌట్ చేయాలని ఇంగ్లండ్ చూసినప్పటికీ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా నాటౌట్గా నిలిచి మ్యాచ్ హీరోలు అయ్యారు.
ఐదో టెస్టుకు టీమిండియా జట్టు అంచనా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్, శార్థూల్ ఠాకూర్/కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa