రష్యా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500 శాతం ప్రతీకార సుంకాలపై చైనా ఘాటుగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్కు ఆయుధాల అందజేసే అంశంపై చర్చ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఐక్యరాజ్యసమితిలో చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్.. అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణకు చైనా కారణం కాదు.. మేము యుద్ధపక్షాలకు ఎలాంటి ప్రాణాంతక ఆయుధాలు అందించలేదు... డ్రోన్లు వంటి డ్యూయల్-యూవీ ఉత్పత్తుల ఎగుమతులపై చైనా ఎప్పుడూ కఠిన నియంత్రణ పాటిస్తోంది’’ అని అన్నారు.
అంతేకాదు, ఉక్రెయిన్-రష్యాలతో చైనా చట్టబద్ధంగా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తోందని షువాంగ్ తెలిపారు. చైనా వాణిజ్యం, ఒప్పందాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికానే ఇప్పటికీ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తోందని గెంగ్ షువాంగ్ మండిపడ్డారు. ‘అమెరికా చేస్తే ఒప్పు.. ఇతర దేశాలు చేస్తే తప్పా?’ అని నిలదీశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభం కీలక దశలో ఉందని, పరిష్కారానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతరులపై నిందలు వేయడం మాని.. సీజ్ఫైర్, కీవ్లో శాంతిస్థావపన అనే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికా సమర్ధవంతంగా వ్యవహరించాలని సూచించారు.
‘‘ఒకవైపు రాజకీయ పరిష్కారానికి చైనా సహకరించాలని కోరుతూ.. ఇంకోపక్క దుష్ప్రచారం చేయడం, ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం అన్యాయం’’అని విమర్శించారు. కాగా, చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరగనప్పటికీ ప్రతీకార సుంకాలు, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా సంబంధిత సవాళ్లు ఇంకా పరిష్కార దశలోనే ఉన్నాయి. ఆగస్టు 12లోపు ఒక స్థిరమైన ఒప్పందం అవసరమని చైనా స్పష్టంగా పేర్కొంది. ఇది సాధ్యం కాకపోతే, రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇక, భారత్పై ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యా నుంచి వాణిజ్యం సాగిస్తూ భారత్ తన ఆర్ధిక వ్యవస్థను తానే ముంచేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa