ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీలో ప్రవేశాలకు ఏపీ ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:44 PM

ఏపీలో డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడై రెండు నెలలు దాటిపోయినా కూడా ఇంకా డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో డిగ్రీలో చేరాల్సిన విద్యార్థులు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‌లో డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి ఎట్టకేలకు ప్రకటన వచ్చింది. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్ట్ 18వ తేదీన విడుదల చేయాలని ఏపీ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఆ రోజు నుంచే డిగ్రీలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి.


ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆగస్ట్ 21 నుంచి 23 వరకూ ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. అలాగే ఆగస్ట్ 21వ తేదీ నుంచి డిగ్రీ విద్యార్థుల కోసం వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి తెస్తారు. డిగ్రీ విద్యార్థుల వెబ్ ఆప్షన్ల ఎంపిక గడువు ఆగస్ట్ 24వ తేదీతో ముగుస్తుంది. అయితే వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకునేందుకు ఆగస్ట్ 25వ వరకూ సమయం ఉంటుంది. ఇంటర్మీడియట్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్ట్ 27వ తేదీ డిగ్రీలో సీట్లు కేటాయిస్తారు. ఆగస్ట్ 28 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభించాలని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది.


మరోవైపు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో ప్రవేశం కోసం కాలేజీ వద్దకు వెళ్లి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కల్పించనున్నారు. అయితే ఆఫ్‌లైన్‌లో స్వీకరించిన దరఖాస్తులను కూడా ఆ తరువాత ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. విద్యార్థులు ఒకవేళ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధానాలలోనూ దరఖాస్తు చేసుకుంటే ఆఫ్‌లైన్‌‌కు తొలి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాలేజీలో సీటు రాకపోతే ఆన్‌లైన్‌ ఎంపికలను పరిగణనలోకి తీసుకుంటారు.


మరోవైపు డిగ్రీ ప్రవేశాలను గతేడాది తరహాలోనే Online Admission Module For Degree Collages (OAMDC) ద్వారా చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ కళాశాలల్లోని డిగ్రీ సీట్లను ఈ విధానంలో పూర్తి చేస్తారు. అయితే ఆగస్ట్ 18వ తేదీ విడుదల చేసే డిగ్రీ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa