తీవ్రమైన కాలినగాయాలతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఒడిశాలోని పూరీకి చెందిన టీనేజర్ను బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె పరిస్థితి విషమించి శనివారం రాత్రి కన్నమూసింది. అయితే, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ముగ్గురు వ్యక్తులు ఆ బాలికకు నిప్పటించినట్టు మొదట్లో భావించగా, ఇందులో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో బాధితురాలి తండ్రి కూడా ఓ విడుదల చేసి.. తన కుమార్తె మానసిక వేదన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
75 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికను చికిత్స కోసం జులై 19న భువనేశ్వర్ ఎయిమ్స్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మర్నాడు ఢిల్లీకి ఎయిర్లిఫ్ట్ చేశారు. కానీ, ప్రభుత్వం, వైద్య నిపుణులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెను కాపాడేకపోయామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఠా వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాల్లోనే ఒడిశా పోలీసులు.. దర్యాప్తు తుది దశకు చేరుకుందని ప్రకటించారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఎవరూ ప్రమేయం లేదని తేలిందని చెప్పారు.అయితే, బాలిక ఏ విధంగా నిప్పు పెట్టుకుందీ అనేది మాత్రం వివరించలేదు.
అలాగే, ఈ విషాద సమయంలో ఎవరూ సున్నితమైన వ్యాఖ్యలు చేయవద్దని పోలీసులు సూచించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే బాధితురాలి తండ్రి ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. తన కుమార్తె మానసిక వేదనతో అర్ధాంతరంగా జీవితం ముగించుకుందని.. దీనిని ఎవరూ రాజకీయం చేయవద్దని, ఆమె ఆత్మకు శాంతి కోరాలని ాయన విజ్ఞప్తి చేశారు.
‘‘నా కుమార్తెను కోల్పోయాను... మానసిక ఒత్తిడికి తాళలేక ఆమె జీవితాన్ని ముగించుకుంది.. ఆమె భరించలేని వేదన ఎదుర్కొంది.. ఒడిశా ప్రభుత్వం మా కుటుంబానికి చాలా సహాయపడింది.. ఈ విషయాన్ని ఎవ్వరూ రాజకీయంగా వాడుకోకండి.. దయచేసి నా కుమార్తె ఆత్మకు శాంతి కోరండి. నాకు ఇప్పుడు కావాల్సింది శాంతి మాత్రమే’’ అని ఆయన అభ్యర్ధించారు.
మరోవైపు, ఈ అంశంపై ఒడిశాలో నిరసనలు కొనసాగుతున్నాయి. బాధిత బాలికకు జూలై 19న నిప్పంటించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్షసాక్షుల ప్రకారం ముగ్గురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నారని చెబుతున్నారు. మంటల్లో కాలిపోతూ నా ఇంటివైపు పరుగెత్తికొచ్చిన ఆమె చేతులు కట్టేసి ఉన్నాయని, తన భార్య, కుమార్తెతో కలిసి మంటలు ఆర్పినట్టు ఓ వ్యక్తి చెప్పారు. తనను బలవంతంగా ముగ్గురు వ్యక్తులు బైక్పై నదీ తీరానికి తీసుకెళ్లి, కిరోసిన్ పోసి నిప్పటించారని బాధితురాలు చెప్పిందని ఆమెకు సహాయం చేసిన ప్రత్యక్షసాక్షి దుఖిశ్యామ్ సెనాపతి తెలిపారు. అలాగే, బాధితురాలి తల్లి కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు గుర్తుతెలియని తెలియని వ్యక్తులు తన కుమార్తెకు నిప్పంటించారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa