ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ . కోహ్లీకి ఉన్న ఫిట్నెస్కు అతడు మరో 2-3 ఏళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతాడని అంతా భావించారు. కానీ విరాట్ మాత్రం అలా అనుకోలేదు. సడెన్గా రెడ్ బాల్ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. ఇక కోహ్లీ లేని లోటు ఇంగ్లాండ్ టూర్లో స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చాలా మంది నెటిజన్లు కోహ్లీ జట్టులో ఉండి ఉంటే కథ వేరేలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా చేరిపోయారు.
ఇంగ్లాండ్తో ఐదో టెస్టు నాలుగో రోజు ఆట జరుగుతుండగా.. కోహ్లీని ఉద్దేశించి.. శశిథరూర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ సిరీస్ మొత్తంలో ముఖ్యంగా.. ఐదో టెస్టులో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అందులో పేర్కొన్నారు.
"భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో కొన్ని సార్లు నేను విరాట్ కోహ్లీ మిస్ అయినట్లు ఫీల్ అయ్యా. ఇలా నాకు చాలా సార్లు అనిపించింది. ది ఓవల్లో జరుగుతున్న ఐదో టెస్టులో ఇది ఇంకా ఎక్కువైంది. అతడి ధైర్యసాహసాలు, ప్రత్యర్థులతో వ్యవహరించే తీరు ప్రత్యేకం. అతడు ఉంటే సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతుంది. అతడు టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తీసుకోవడం భారత క్రికెట్కు లోటే. మరి ఆ నిర్ణయం నుంచి విరాట్ కోహ్లీని వెనక్కి రమ్మని పిలవడం ఏమైనా ఆలస్యమైందా.. అనిపిస్తోంది. కానీ.. అతడి సేవలు దేశానికి అవసరం" అని శశిథరూర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
చాలా మంది అభిమానులు.. ఈ సిరీస్లో ఎన్నో సార్లు కోహ్లీని తలుచుకున్నారు. అతడు ఉంటే జట్టు వాతావరణమే మారిపోతుందని.. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ.. టీమ్లో ఉంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసేందుకు కూడా భయపడేవారని పేర్కొంటున్నారు. కీలక సమయాల్లో రాణించే కోహ్లీ ఉంటే.. సిరీస్ ఫలితం ఇలా ఉండేది కాదని కోహ్లి అభిమానులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa