ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత బస్సు ప్రయాణం,,, ప్రభుత్వం మార్గదర్శకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 08:16 PM

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతోందని తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డుతో ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణించవచ్చిన పేర్కొంది.


అయితే, కొన్నింటికి మాత్రం ఫ్రీ బస్సు పథకం నుంచి మినహాయింపు ఉంది. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు, నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు. ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేసింది. స్త్రీ శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్‌ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే, బస్టాండ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేస్తూ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు వెలువరించారు.


అమరావతిని సింగపూర్ చేయడమే చంద్రబాబు ధ్యేయం.. అదే పర్యటన ఉద్దేశం: రాంప్రసాద్ రెడ్డి


ఇక, ఏపీఎస్ఆర్టీసీ అధీనంలోని మొత్తం బస్సుల్లో 74 శాతం అంటే 11,449 బస్సులు ఉండగా.. వీటిలో 8,458 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ పథకం అమలవుతుంది. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, ఏసీ, సప్తగిరి బస్సుల్లో కలిసి మెుత్తం 2,991 బస్సులకు ఇది వర్తించదు. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ఈ పథకం వర్తించదు. అలాగే, అల్లూరి జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్లలో నడిచే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఫ్రీ జర్నీ పథకం వీటికి వర్తింపజేస్తే రద్దీ విపరీతంగా పెరిగి నడపడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఇక, డ్రైవర్లు, కండక్టర్లను తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa