పేరడిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది
ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరగగా, కొన్ని రాష్ట్రాలకు కేంద్రం భారీ వరాలు ప్రకటించింది.
ఏపీకి కేంద్రం వరాల జల్లు
ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నూతన ప్రాజెక్టుల రూపంలో బహుమతులు ఇచ్చింది. అత్యధిక ఎంపీలను అందించిన ఏపీకి స్పెషల్ ఫోకస్ ఇచ్చిన కేంద్రం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది.
నాలుగు కొత్త సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాల్లో భాగంగా నాలుగు కొత్త సెమీకండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపింది. ఇవి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, టెక్నాలజీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్
ఏపీతో పాటు ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలకూ కేంద్రం వరాలు ప్రకటించింది. వీటి ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పాటుగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని సమాచారం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa