ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎదుగుతున్న స్టార్టప్ కంపెనీ పర్ప్లెక్సిటీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. అరవింద్ శ్రీనివాస్ నాయకత్వంలోని ఈ సంస్థ, గూగుల్కు ఏకంగా 34.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3.02 లక్షల కోట్లు) విలువ చేసే ఆఫర్ను ఇచ్చినట్టు సమాచారం. ఇది పర్ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం.
గూగుల్ క్రోమ్ ఈ తరానికి కీలకమైన వెబ్ బ్రౌజర్గా మారింది. గ్లోబల్ మార్కెట్లో దాని ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, అమెరికా ప్రభుత్వం గూగుల్పై మనోపూర్వకంగా పోటీకి అంతరాయం కలిగించుతోందని ఆరోపిస్తూ, కొన్ని విభాగాలను విడగొట్టాలని ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, గూగుల్ క్రోమ్ను అమ్మే అవకాశాలపై చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పర్ప్లెక్సిటీ, సుదీర్ఘ వ్యూహాత్మక దృష్టితో, బ్రౌజర్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. క్రోమ్ను పొందగలిగితే, తమ ఏఐ మోడళ్లను నేరుగా వినియోగదారులకు అందించే గేట్వేగా వినియోగించుకునే అవకాశం ఉంది. గూగుల్ క్రోమ్ వలన కలిగే డేటా యాక్సెస్, యూజర్ ఇంటరాక్షన్ పర్ప్లెక్సిటీకి పెరిగిన సామర్థ్యాన్ని అందించగలదు.
ఇది సాధ్యమైతే, టెక్ రంగంలో ఇది ఓ చరిత్రాత్మక కొనుగోలుగా నిలవనుంది. అయితే గూగుల్ ఈ ఆఫర్ను స్వీకరిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. గూగుల్ తన ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన క్రోమ్ను వదులుకుంటుందా? లేక ఈ ఆఫర్ను తిరస్కరిస్తుందా? అనే విషయంపై అధికారిక ప్రకటన కోసం టెక్ ప్రపంచం ఎదురు చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa