సింధు నదీ జలాల నిలిపివేతపై ఇటీవల పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. సింధు జలాల కోసం భారత్తో ఎంతవరకైనా పోరాటం చేస్తామని షెహబాజ్ షరీఫ్ కవ్వింపులకు దిగగా.. మా వద్ద బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయని.. అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని.. పాకిస్తాన్కు ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. ఇక భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఓవైసీ ఖండించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గినట్లే తగ్గి.. ఇటీవల మరోసారి తీవ్రం అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సహా ఆ దేశ మంత్రులు, ఇతర నేతలు చేస్తున్న కవ్వింపు వ్యాఖ్యలు.. రెండు దేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణాన్ని నెలకొనేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్పై తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు.. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. భారత్పై తీవ్ర అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ వద్ద బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయని.. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్పై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. సింధు నదీ జలాలను నిలిపేసేందుకు తీసుకునే ఎలాంటి చర్య అయినా.. యుద్ధానికి కవ్వింపు చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్కు దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్కను కూడా లాక్కునేందుకు భారత్ ప్రయత్నిస్తే.. అలాంటి అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు. సింధూ జలాలను సాధించుకోవడం కోసం ఎంత వరకైనా పాకిస్తాన్ పోరాటం చేస్తుందని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
షెహబాజ్ షరీఫ్ చేసిన ఈ హెచ్చరికలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్థం లేని మాటలు మాట్లాడొద్దంటూ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వితే భారత్ చూస్తూ ఊరుకోదని గట్టిగా బదులిచ్చారు. భారత్ వద్ద బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయని.. పాక్ ప్రధాని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ విషయంలో ఇలాంటి బెదిరింపులు ఏ మాత్రం పనిచేయవని తేల్చి చెప్పారు. అయ్యిందేదో అయిపోయిందని.. ఇక చాలు అంటూ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
మరోవైపు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ తిప్పికొట్టారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశమని అసిమ్ మునీర్ చేసిన హెచ్చరికలను కూడా ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు.. ఉపయోగించిన పదజాలం సమర్థనీయం కాదని మండిపడ్డారు. ఇక అమెరికా గడ్డపై నుంచి అసిమ్ మునీర్ ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa