మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు టీమిండియాలో మంచి అవకాశాలు పొందుతున్నాడు. ముఖ్యంగా టీ20తో పాటు టెస్టుల్లో కూడా జట్టులో స్థానం సంపాదించాడు. 22 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్తో పాటు సినిమాల్లో కూడా యాక్టివ్గా ఉంటాడు. ఐపీఎల్తో ఫేమ్లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి టాలీవుడ్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తుంటాడు. తాజాగా అతడు రీ రిలీజ్కి వెళ్లి సందడి చేశాడు.
నితీష్ కుమార్ రెడ్డి మహేష్ బాబు కు చాలా పెద్ద అభిమాని. గతంలో కూడా మహేష్ బాబు గురించి చెప్పాడు. సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రమోషన్స్లలో కూడా మహేష్ బాబు డైలాగ్స్ చెప్పి అలరించాడు. ఐపీఎల్ 2025 సందర్భంగా ఓ ఈవెంట్లో పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ 'ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కావట్లేదు.. పదిమంది ఉన్నారు వేసేస్తే ఇంటికి వెళ్లిపోవచ్చు' అని చెప్పి అలరించాడు.
గతేడాది బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసి పుష్ప రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు కాబట్టి కచ్చితంగా టాలీవుడ్ ప్రభావం తనపై ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత అత్యంత చిన్న వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా నితీష్ నిలిచాడు.
ఐపీఎల్ 2024లో తన బ్యాటింగ్తో ఆకట్టుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత టీ20ల్లో భారత్ తరఫున అవకాశాలు కూడా పొందాడు. ఐపీఎల్ 2025కి ముందు గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి మునుపటి ఫామ్ కొనసాగించలేకపోయాడు. గతేడాది ఐపీఎల్లో అనుకున్న రేంజ్లో ఆడలేకపోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇటీవల జరిగిన అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సీజన్ మధ్యలోనే గాయపడి సిరీస్ నుంచే దూరమయ్యాడు.
22 సంవత్సరాల నితీష్ కుమార్ రెడ్డి 28 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 485 పరుగులు నమోదు చేశాడు. 76 బెస్ట్తో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఏడు టెస్టుల్లో 13 ఇన్నింగ్స్లు ఆడి 343 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 114 హైయెస్ట్తో ఒక సెంచరీ ఉండటం విశేషం. నాలుగు టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో 90 పరుగులు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa