రాత్రి డిన్నర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి ఏది పడితే అది తినడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రాత్రి ఏడు గంటల తర్వాత కొన్ని ఆహారాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు అంటున్నారు. ఆ ఫుడ్స్ లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి ఏడు గంటల తర్వాత పొరపాటున కూడా కొన్ని తినకండి, నిద్ర పట్టకపోగా గుండె, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి
హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక, రాత్రి భోజనం అనేది చాలా కీలకమైంది. అయితే, మనలో చాలా మంది ఇష్టపడేది డిన్నర్నే. రాత్రిపూట భోజనంలో ఏది పడితే అది తింటుంటారు. రెసారెంట్లలో ఎక్కువగా తినేది రాత్రిపూటే. ఈ రాత్రిపూట భోజనంలో బిర్యానీలు, మసాలా కర్రీలు, స్నాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే చాంతడంత లిస్ట్ ఉంది.
రాత్రి 7 గంటల తర్వాత ఆలస్యంగా భోజనం చేస్తే, జీర్ణ సమస్యలు, కడుపులో చికాకు, అధిక రక్తపోటు మొదలైన వాటికి కారణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం, త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎవరికైనా సాయంత్రం 7 గంటల తర్వాత ఆకలిగా అనిపిస్తే, కిచ్డి వంటి తేలికపాటి ఆహారాలు లేదా రెండు ఖర్జూరాలు లేదా కొన్ని బాదంపప్పులతో ఒక గ్లాసు పాలు తీసుకోవచ్చు. కానీ, కొన్ని ఆహారాల్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఆ ఫుడ్స్ తింటే ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టే అని నిపుణులు అంటున్నారు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ బిర్యానీ
ఇక, చాలా మంది రాత్రిపూట ఎక్కువగా తినేది బిర్యానీ. చికెన్, మటన్, ఫిష్, రొయ్యల ఇలా రకరకాల బిర్యానీలు తింటుంటారు. అయితే, రాత్రి ఏడు గంటల తర్వాత మటన్ బిర్యానీ తినకూడదని నిపుణులు అంటున్నారు. మటన్ బిర్యానీలు కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది రాత్రి బిర్యానీ తినేటప్పుడు కేలరీలు, కొవ్వు పదార్థాల్ని పట్టించుకోరు. అయితే, రాత్రి పూట ఏడు తర్వాత మటన్ బిర్యానీ తినడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక, చిన్న మొత్తంలో మటన్ బిర్యానీ 500 - 700 కేలరీలకు సమానం. ఇంతమొత్తంలో కేలరీలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదముంది.
స్పైసీగా ఉండే ఆహారాలు
భారతదేశంలో స్పైసీగా ఉండే ఆహారాలకు కొదవేమీ లేదు. చాలా మంది కారంగా, ఘాటుగా ఉండే ఆహారాల్నే ఇష్టపడతారు. స్పైసీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కొల్హాపురీ చికెన్ వంటివి తింటుంటారు. వీటిని నాన్, పరాఠా, అన్నం, బ్రెడ్తో తింటుంటారు. కానీ, రాత్రి ఏడు గంటల తర్వాత ఇలాంటి స్పైసీ వంటకాలు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తినడం వల్ల గుండెల్లో తీవ్రమైన మంట వస్తుంది. అంతేకాదు ఈ వంటకాల్ని నూనె, నెయ్యితో తయారు చేస్తారు. ఇది గుండె సంబంధిత సమస్యల్ని కలిగిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండండి.
స్వీట్స్, తీపి వంటకాలు
సాయంత్రం 7 గంటల తర్వాత స్వీట్లు తినడం పూర్తిగా మానేయండి. ఎందుకంటే వీటిని తినడం వల్ల శరీరం నిద్రపోయే విధానానికి ఆటంకం కలుగుతుంది. అయితే, మనలో చాలా మందికి రాత్రి తిన్న తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంది. అయితే, ఈ అలవాటు వల్ల మీరు నిద్రకు ఆటంకం కలుసుదుంతి. అంతేకాకుండా మీకు ఎక్కువ తినాలనే కోరిక కలుగుతుంది. రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి సాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, దీనికి విరుద్ధంగా మీరు రాత్రంతా మేల్కొనే అవకాశం ఉంది.
బజ్జీలు, పకోడీలు
మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. సాయంత్రం సమయం చల్లని వాతావరణానికి బజ్జీలు లేదా పకోడీలు తినడం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. అయితే, ఏడు గంటల తర్వాత పకోడీలు లేదా బజ్జీలు తినడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే పకోడీలు, బజ్జీలను ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తారు. ఇవి అధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. రాత్రిపూట అధిక ఆమ్లత్వం ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు అవి జీర్ణమవ్వడానికి సయమం పడుతుంది. దీంతో, మీకు నిద్రలో సమస్యలను కలిగిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa