ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 09:20 PM

79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశంలోని యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభవార్త అందజేశారు. రూ.లక్ష కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ పేరుతో యువత కోసం పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రయివేట్ సెక్టార్‌లో తొలిసారి ఉద్యోగ రంగంలోకి చేరిన యువతీ యువకులకు రూ.15,000 కేంద్రం అందజేయనుంది.ఈ పథకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. దీని ద్వారా దేశంలోని 3.5 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని వివరించారు.


‘‘ఈ రోజు ఆగస్టు 15.. దేశంలోని యువత కోసం లక్ష కోట్ల రూపాయాలతో కొత్త పథకం ప్రారంభిస్తున్నాం.. మీకు ఇది శుభవార్త.. ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ప్రారంభం కానుంది’’ అని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ఆమోదించినట్టు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత నెలలో తెలిపింది.


ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని అని జులై 25న వెలువరించిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. వీరిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తారు. ‘వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ పేరు ఉంది.. దేశంలో సమ్మిళిత, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ మొదటిసారిగా ఉపాధి పొందుతున్నవారు.. పార్ట్ బి కింద యజమాన్యాలు వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa