పులివెందులలో మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవత శాంతి వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, మానవత ఛైర్మన్ డి. వి. కొండారెడ్డి ప్రపంచ శాంతి కోసం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు సాగింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, శాంతి కోసం ప్రతిజ్ఞ చేశారు. మానవత సభ్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa