ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 26నా, 27నా అనే గందరగోళం చాలా మందిలో ఉంది. ఈ ఏడాది భాద్రపద శుక్లపక్ష చతుర్థి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజునే వినాయక చవితిని జరుపుతాము. చవితి ఆగస్టు 26 మధ్యాహ్నం గం.1:54 ప్రారంభమై 27 మధ్యాహ్నం 3:44తో ముగుస్తుంది. ఈ లెక్కన ఆగస్టు 27న వినాయక చవితిని జరుపుకోవాలని పురోహితులు చెబుతున్నారు. ఆగస్టు 27 ఉదయం 5:20 నుంచి 7:20 మధ్య సింహలగ్నంలో పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa