ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28 నుంచి 30వరకు జనసేన విస్త్రృతస్థాయి భేటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 03:17 PM

AP: విశాఖలో ఆగస్టు 28 నుంచి 30 వరకు జనసేన విస్త్రృతస్థాయి భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన ‘సేనతో సేనాని’ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోపవన్‌ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఆగస్టు 28న జనసేన లెజిస్లేటివ్‌ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ భేటీలో పర్యావరణం, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన, సుపరిపాలనపై చర్చిస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa