ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాదా బైనామాల క్రమబద్ధీకరణకు న్యాయ అనుమతి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 11:10 PM

తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 10న ఒక జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే ఏడాది నవంబరులో హైకోర్టు ఈ జీవో అమలుపై స్టే విధించింది. చట్టపరమైన ఆధారాలు లేకుండా క్రమబద్ధీకరణ ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'భూభారతి' చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించిన విధానాలను చేర్చినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం, సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అనుమతిస్తూ, ఈ కేసుకు తుది తీర్పు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa