ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణనాధుని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:35 AM

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వినాయక చవితి విశిష్టతను వివరించారు.హైందవ పండుగలలో కొన్నింటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, కానీ వినాయక చవితిని మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని ఆయన అన్నారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ సందర్భంగా గణనాథుని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.గణాలకు అధిపతి లంబోదరుడని, ప్రజలు తలపెట్టే అన్ని శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఒక విన్నపం చేస్తూ మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa