జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్ లో నిర్వహిస్తున్న పర్యటనలో రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బీహార్ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రేవంత్ రెడ్డిని వెంట తిప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు.రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' చేపట్టడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కానీ, గతంలో బీహారీల డీఎన్ఏలోనే కూలీలుగా పనిచేయడం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకుని తిరగడం సరికాదన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి బీహార్లోని గ్రామాల్లో పర్యటిస్తే, అక్కడి ప్రజలే ఆయన్ను తరిమి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ వేదిక పంచుకోవడంపై మీడియా ప్రశ్నించగా, ప్రశాంత్ కిషోర్ మరింత ఘాటుగా స్పందించారు. "అసలు బీహార్ కు రేవంత్ రెడ్డి ఏం చేశారు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం అని ఆయన నిలదీశారు. అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ ఇంకా తన పక్కన పెట్టుకుంటున్నారంటే, అది ఆయన మానసికతను తెలియజేస్తోందని పీకే విమర్శించారు.ఈ వ్యాఖ్యల అనంతరం, రేవంత్ రెడ్డి పర్యటనపై తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తూ ప్రశాంత్ కిషోర్ మీడియా సమావేశాన్ని ముగించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, బీహార్ లో రేవంత్ ఉనికిని పీకే తీవ్రంగా వ్యతిరేకించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa