ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతరం నారా చంద్రబాబు నాయుడు బుధవారం 5వ రాష్ట్ర ఆర్థిక సంఘంతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలహీనంగా ఉన్న స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ దిశగా వివిధ చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
పంచాయతీల ఆదాయ వనరులను వర్గీకరించి, వాటి ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల ఆదాయాన్ని ఆధారంగా కేటగిరీలుగా విభజించి, వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఈ చర్యలు స్థానిక సంస్థలకు సొంత ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు, వాటి పరిపాలనా సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ రికార్డులను డిజిటలీకరణ చేయాలని సూచించారు. ఈ చర్య స్థానిక సంస్థల పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు, ప్రజలకు సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుందని ఆయన తెలిపారు. గ్రామీణ సంస్థల ఆర్థిక లావాదేవీలు, సేవల పంపిణీ వంటి అంశాలను ఆన్లైన్లో ఉంచడం ద్వారా పాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన ఉద్ఘాటించారు.
5వ రాష్ట్ర ఆర్థిక సంఘం స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించి ఆర్థిక, ఆర్థికేతర సిఫార్సులను చేసింది. ఈ సిఫార్సులు స్థానిక సంస్థల ఆర్థిక స్వయంప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంచే దిశగా కీలకమైనవిగా భావిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని, ఈ చర్యలు స్థానిక సంస్థలను ఆర్థికంగా స్వతంత్రంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఉన్నాయని ఆర్థిక సంఘం సభ్యులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa