ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ మహిళ, ఇద్దరు కానిస్టేబుల్స్.. అర్ధరాత్రి నడిరోడ్డుపై రచ్చ రచ్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 07:22 PM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. మద్యం మత్తులో మహిళతో.. ఫోర్త్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ గొడవ పడినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తుతో పాటు యూనిఫాంలో ఉండి ఓ మహిళతో గొడవ పడుతుండగా అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు. అయితే, ఈ గొడవ వ్యక్తిగత వ్యవహారాలతో తలెత్తిందని తెలుస్తోంది. ఎందుకంటే మహిళతో శ్రీనివాస నాయక్ గొడవ పడుతుంటే అజిత్ సింగ్ నగర్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కూడా వచ్చారు. గొడవ కారణంగా అతడి చొక్కా చిరిగిపోయింది. అటు కోటేశ్వరరావును విడిచిపెట్టాలంటూ ఆ మహిళ గట్టిగా అరిచింది.. చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఈ గొడవను ఆగి చూడటం మెుదలుపెట్టారు. చూడటమే కాదు.. రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు పంపారు. అయితే, నడిరోడ్డుపై చొక్కాలు పట్టుకుని గొడవ పడిన శ్రీనివాస నాయక్, కోటేశ్వరరావుల వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుశాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరిని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేశారు. మెుత్తంగా ఒక మహిళ కారణంగా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa