పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలంటే తల్లి తర్వాతే ఎవరైనా. ఒకప్పటి కాలం అయితే పిల్లలు మాట వినకపోతే నాలుగు తగిలించేవారు. ఇప్పుడు కాలం మారింది. ఈకాలం పిల్లలను కొడితే ఊరుకోరు. ఇంకా మొండికేస్తారు. వాళ్లకు చెప్పే రీతిలో చెబితే వింటారు. అలా చెప్పే టెక్నిక్స్ కూడా అందరికి తెలియవు. పైగా ఇది ఏఐ జనరేషన్. దాన్ని వాడుకుని.. అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు కొందరు. అదలా ఉంచితే ఏఐతో పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి ఓ మహిళ వాడిన టెక్నిక్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాలు..
ఇంట్లో ఒక్కరిద్దరూ పిల్లలు ఉంటేనే వారి అల్లరిని కట్టడి చేయలేం. అదే ఓ నలుగురు ఉంటే వారి పరిస్థితి.. పాపం వర్ణించడానికి మాటలు చాలవు. ఇక నేటి కాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. అటు జాబ్.. ఇటు ఇంటి నిర్వహణ.. రెండు పనులతో అలసి పోతుంటారు. దీనికి తోడు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారు ప్రతి దాన్ని లాగి కిందపడేస్తారు. బొమ్మలు ఇల్లాంతా పరుస్తారు. వాటన్నింటిని సర్దడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలను హెల్ప్ చేయమంటే అస్సలు వినరు. మరి అలాంటి పిల్లలను మాట వినేలా చేయాలంటే ఏం చేయాలి.. ఇదుగో ఈ మహిళ వాడిన టెక్నిక్ వినియోగించాలి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు నలుగురు సంతానం. ఇక అంత మంది పిల్లలు ఉంటే ఇల్లు కిష్కిందే అవుతుంది. ఆ మహిళ పరిస్థితి కూడా అందుకు ఏమాత్రం విరుద్ధం కాదు. అయితే పిల్లల అల్లరిని వారి చేతనే సెట్ చేయించడానికి ఆ మహిళ ఏఐని వాడుకుంది. పిల్లలు ఇంట్లో అల్లరి చేసి.. ఇంటిని చెత్త చెత్తగా ఎలా మార్చారో వీడియో తీసింది. తర్వాత దాన్ని ఓ న్యూస్ చానెల్లో టెలికాస్ట్ అవుతున్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేసింది. పిల్లలు టీవీ చూస్తుండగా వారి దగ్గరకు వెళ్లింది.
ఆ తర్వాత టీవీలో న్యూస్ టెలికాస్ట్ అయ్యింది. దీనిలో ఓ యాంకర్ పిల్లల అల్లరి గురించి చెబుతున్నట్లు టెలికాస్ట్ అయ్యింది. వారు ఇంటిని ఎంత చిందరవందరగా మార్చారో.. అదంతా రికార్డ్ అయ్యిందని.. న్యూస్లో వస్తుందని.. వీరి అల్లరిని ప్రపంచం అంతా చూస్తుందని పిల్లలను నమ్మించలగింది. ఇంకేముందు.. న్యూస్లో తమ అల్లరి.. ఇంటిని చెత్త చెత్తగా మార్చిన విధానం చూసిన పిల్లలు.. పరుగున వారి గదికి వెళ్లీ క్లీన్ చేసే పనిలో పడ్డారు. పిల్లల్లో వచ్చిన మార్పు చూసి తల్లి సంతోషపడింది. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. ఈ ఐడియా పని చేసింది అనే క్యాప్షన్తో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa