ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే పాఠశాలలో 102 మంది టీచర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 02:44 PM

విశాఖ జిల్లాలోని చంద్రంపాలెం హైస్కూల్, రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్న పాఠశాలగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 3,086 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 102 మంది ఉపాధ్యాయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయులు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ఆధునిక సదుపాయాలు, విశాలమైన భవనాలు, క్రీడా మైదానం వంటి సౌకర్యాలున్న ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా విద్యార్థులు పోటీ పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa