ఆలయం వద్ద విషాదం చోటు చేసుకుంది. కొండ పైకి కిందికి తిరిగే రోప్ వే తెగిపడి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొండపైన ఉన్న ఆలయానికి చేరుకోవాలంటే మెట్లు ఎక్కడం, లేదా రోప్ వే ద్వారా వెళ్లాల్సిందే. అయితే భక్తులు ప్రయాణించే రోప్ వేను పలు కారణాల వల్ల నిలిపేశారు. దీంతో భక్తులంతా మెట్ల మార్గం నుంచే కొండపైన ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే వస్తువులు, ఇతర సరుకులు పంపించేందుకు మాత్రమే ప్రస్తుతం రోప్ వే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ కార్గో రోప్ వే ప్రమాదానికి గురైంది. రోప్ వే వెళ్తుండగా.. ఒక్కసారిగా వైరు తెగడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక భక్తుల రోప్ వే కూడా పనిచేస్తే.. ఈ ప్రమాదం మరింత పెద్దది అయ్యేదని స్థానికులు చెబుతున్నారు.
గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పావగఢ్ శక్తి పీఠంలో కార్గో రోప్వే వైర్ అకస్మాత్తుగా తెగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు లిఫ్ట్మెన్లు, ఇద్దరు కార్మికులతో పాటు మరో ఇద్దరు స్థానికులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను పంచ్మహల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ హరీష్ దుధత్ వివరించారు. ఈ రోప్ వే తెగిపడిన తర్వాత.. ఆ ప్రాంతం మొత్తం తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు.
పావగఢ్ శక్తి పీఠం మహాకాళి అమ్మవారికి అంకితం ఇచ్చారు. ఈ కొండ భూమికి దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొండ నుంచి పైకి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి భక్తులు 2 వేల మెట్లు ఎక్కి.. ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా రోప్వే ద్వారా కూడా కొండపైకి వెళ్లొచ్చు. అయితే శనివారం ఉదయం నుంచి.. పలు కారణాలతో భక్తులను తరలించే రోప్ వేను నిర్వాహకులు మూసివేశారు. కేవలం వస్తువులను పైకి తీసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో రోప్వే మాత్రమే నడిపిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
పావగఢ్ శక్తి పీఠం మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు.. ప్రతీ సంవత్సరం దాదాపు 25 లక్షల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అలాంటి క్షేత్రంలో ఈ ప్రమాదం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. టెక్నికల్ దర్యాప్తు నిర్వహించిన తర్వాతే అసలు ప్రమాదం ఎందుకు జరిగిందనే కారణం స్పష్టంగా తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులు చనిపోయినట్లు గుర్చించామని పావగఢ్ ఎస్పీ హరీష్ దుధత్ వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించామని.. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. బలమైన గాలుల కారణంగా.. భక్తుల భద్రత కోసం రోప్ వే ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa