భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్, టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పడంతో వారు స్టేడియంలో కనిపించడం తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా ఫార్మాట్తో సంబంధం లేకుండా తీరిక లేకుండా మ్యాచ్లు ఆడిన వీరు.. కెరీర్ ముగింప దశకు వచ్చారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలనే లక్ష్యంతో భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరూ చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సిద్దం అవుతున్నారు.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అర్హత సాధించేందుకు నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాస్ అయ్యారు. అయితే రోహిత్, కోహ్లీలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందే.. మైదానంలో కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజాలు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన సిరీస్కు ముందు ఆస్ట్రేలియా-ఏతో ఆడి ఫామ్, ఫిట్నెస్ సాధించాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా-ఏతో.. ఇండియా-ఏ మూడు వన్డేలు ఆడనుంది. ఇవి అనధికారిక వన్డే మ్యాచ్లు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 తేదీల్లో ఈ వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసమైనా ఆస్ట్రేలియా-ఏతో సిరీస్లో రోహిత్, కోహ్లీ ఆడే అవకాశం ఉంది. ఇక రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగాలంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రాణించడం కీలకం. దీంతో ఈ సిరీస్పై క్రికెట్ ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్ల షెడ్యూల్..
వన్డే సిరీస్..
తొలి వన్డే: అక్టోబర్ 19 - పెర్త్ స్టేడియం
రెండో వన్డే: అక్టోబర్ 23 - అడిలైడ్ ఓవల్
మూడో వన్డే: అక్టోబర్ 25 - సిడ్నీ క్రికెట్ స్టేడియం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa