ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ తారిఖ్ అన్వర్ వరద బాధితుల సందర్శనపై బీజేపీ గగ్గోలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 01:34 PM

బీహార్ లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఇటీవలి వర్షాలకు కతిహార్ ప్రాంతం వరదల్లో మునిగిపోగా.. బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు స్థానిక ఎంపీ తారిఖ్ అన్వర్ అక్కడ పర్యటించారు. ఈ పర్యటనలో ఎంపీ తారిఖ్ అన్వర్ ను ఓ గ్రామస్థుడు వీపుపై మోసుకెళుతున్న వీడియో ఒకటి బయటికి రావడం విమర్శలకు దారితీసింది. గ్రామస్థుడి వీపుపైకెక్కి కాలికి బురద అంటకుండా వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఎంపీ తారిఖ్ ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే గ్రామస్థుడు ఆయనను మోసుకెళ్లాడని సమర్థించుకునే ప్రయత్నం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa