ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల నిరసనలతో సోషల్ మీడియా వివాదంపై దిగొచ్చిన నేపాల్ ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 05:22 PM

నేపాల్‌లో ఇటీవల సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధం తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ప్రభుత్వం అత్యవసరంగా నిర్ణయం మార్చుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో సోమవారం రాత్రి జరిగిన అత్యవసర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ, "సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. మళ్లీ ఈ మాధ్యమాలు సాధారణంగా పనిచేయనున్నారు" అని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa