అనంతపురం వేదికగా బుధవారం జరగనున్న 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పర్యవేక్షించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, భద్రతాపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దని అధికారులను హోంమంత్రి అనిత గట్టిగా ఆదేశించారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధికారులకు కీలక సూచనలు చేశారు.బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఈ విజయోత్సవ సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ప్రముఖుల పర్యటన, భారీ జనసమీకరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa