ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 06:59 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తోందని, అది రెడ్ల పార్టీ అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, బీసీ నాయకుడు వి. హనుమంతరావు అంశాన్ని పాల్ ప్రస్తావించారు. నిజంగా బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్, కీలక పదవుల విషయంలో వారిని ఎందుకు విస్మరిస్తోందని నిలదీశారు.రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా అర్థమవుతుందని కేఏ పాల్ అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలనే ముఖ్యమంత్రులుగా చేసిందని గుర్తు చేశారు. కానీ, ఏ ఒక్క రోజైనా బీసీల గురించి ఆలోచించి, వారికి ఆ ఉన్నత పదవి ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఏమాత్రం ప్రేమ లేదని, కేవలం ఓట్ల కోసమే వారిని వాడుకుంటుందని కేఏ పాల్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa