ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సచివాలయ ఉద్యోగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 03:14 PM

వ్యక్తిగత కారణాలతో గరుగుబిల్లి మండలం చినగుడబ సచివాలయ ఉద్యోగి ఇటీవల స్వగ్రామం దుప్పలపూడిలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య దూరమైందనే బాధతో 20 రోజుల కిందట సాలూరులో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, రుణ యాప్‌ల కారణంగా అప్పులపాలై పాచిపెంట మండలానికి చెందిన ఓ యువకుడు కొద్దినెలల కిందట జీగిరాం సమీపంలో పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా చిన్న చిన్న సమస్యలు, పలు కారణాలతో జిల్లాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి తీరని శోకం మిగులుస్తున్నారు. క్షణికావేశంలో బంగారు జీవితాన్ని బలి చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో 186 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో యువత అధిక సంఖ్యలో ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఉన్నది ఒకటే జీవితం. దానిని కాపాడుకోవాలి. క్షణికావేశంలో అమూల్యమైన జీవితాన్ని చేజేతులా కాల్చుకుంటే.. అక్కడితోనే కథ ముగిసిపోతుంది. అందుకే బతికుండి ఏదైనా సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa