ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్నాల పేరుతో జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 03:15 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాల పేరుతో ఏపీలో శాంతి భద్రతలకు జగన్, ఆయన అనుచరులు విఘాతం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉందంటే, ఇది రైతు ద్రోహి పాలనకు ప్రత్యక్ష నిదర్శనం కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తాను అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa