ఆదాయపు పన్ను రిటర్నుల డెడ్లైన్ సెప్టెంబర్ 15, 2025తో ముగియనుంది. అయితే, ఈసారి ఇ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు, ఐటీఆర్ ఫారాలు ఆలస్యంగా జారీ చేయడం వంటి కారణాలతో మరోసారి గడువు పొడిగించాలని ట్యాక్స్ పేయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖకు పలు ట్రేడ్ యూనియన్లు సైతం లేఖలు రాశాయి. ఇప్పటికే జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును సైతం మరోసారి పొడిగించాలంటున్నారు. మరో 15 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 30, 2025 వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
ట్యాక్స్ పేయర్లను అలర్ట్ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటన చేసింది. సెప్టెంబర్ 15 గడువులోపు తమ రిటర్నుల ఫైలింగ్ పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు సెప్టెంబర్ 7, 2025 రోజునే ఓ ప్రకటన చేసింది. ఆ ప్రకటన సారాంశం ప్రకారం తమ అకౌంట్లు ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు మరోసారి ఐటీఆర్ గడువు పొడిగించే అవకాశం లేదని సష్టమవుతోంది. సెప్టెంబర్ 15వ తేదీలోపే వివిధ కేటగిరీల ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నుల దాఖలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అంటే ఇక గడువు పెంచే ఆలోచన లేదని తేల్చేసింది.
ట్యాక్స్ పేయర్లకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో భాగంగా గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన రిటర్నుల గడువును జూలై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించినట్లు గుర్తు చేసింది. ఇప్పటికే 45 రోజుల సమయం ఇచ్చామని, మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని సూత్రప్రాయంగా తెలిపింది. సెప్టెంబర్ 7వ తేదీన జారీ చేసిన రిమైండర్ ప్రకారం.. అసెస్మెంట్ ఇయర్ 2025-26కు సంబంధించిన రిటర్నుల ఫైలింగ్ కోసం ట్యాక్స్ పేయర్లకు ఇప్పటికే కావాల్సినంత అదనపు సమయం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఐటీఆర్ ఫైలింగ్ డెడ్లైన్ మిస్ అయితే పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని ట్యాక్స్ పేయర్లను హెచ్చరించింది. 'ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయడం అనేది ముఖ్యంగా బాధ్యత. ఇది వ్యక్తులు, సంస్థలు తమ ఆదాయం, ట్యాక్సులు, రీఫండ్ల వివరాలను తెలియజేసే అవకాశం కల్పిస్తుంది. ఇచ్చిన గడువులోపు ఫైల్ చేయడం ద్వారా పెనాల్టీలు తప్పించుకోవచ్చు. వేగంగా ప్రాసెసింగ్ పూర్తయి రీఫండ్ వేగంగా అందుకోవచ్చు. అలాగే రుణాలు పొందేందుకు, వీసాలు వేగంగా వచ్చేందుకు, ఇతర ఆర్థిక అవసరాల కోసం ముఖ్యంగా ఆర్థిక రికార్డుగా ఇది ఉపయోగపడుతుంది' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa