ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 02:56 PM

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా (ఈవో) రెండోసారి అవకాశం లభించిన సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, తనపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. గత అనుభవాన్ని ఉపయోగించి మరింత సమర్థంగా సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పూర్వపు ఈవో శ్రీ శ్యామలరావు నుండి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికార బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం, శ్రీ సింఘాల్ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీసియోగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, తిరుమల క్షేత్రం విశ్వవ్యాప్తమైన పవిత్రత కలిగిన ప్రాంతమని, ఇక్కడ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తన ప్రాధాన్యతలు నిర్దేశించుకుంటానన్నారు. భక్తుల అవసరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa