ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు పాకిస్థాన్తో క్రికెట్ ఆడటం, వ్యాపారాలు చేయడం సరికాదని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్అభిప్రాయపడ్డాడు. దుబాయ్లో ఎల్లుండి భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న నేపథ్యంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది పహల్గామ్లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి ఆయన ప్రస్తావించాడు. "ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్తో క్రికెట్, వ్యాపారం వంటివి ఉండకూడదని అందరూ భావించారు. మేం కూడా లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో పాక్తో మ్యాచ్ ఆడలేదు" అని భజ్జీ గుర్తుచేశాడు.అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశాడు. "వ్యక్తిగతంగా పాకిస్థాన్తో క్రికెట్, వ్యాపార సంబంధాలను నేను సమర్థించను. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే వరకు ఇవి ఉండకూడదనేది నా అభిప్రాయం. కానీ, మ్యాచ్ జరగాలని ప్రభుత్వం చెబితే దాన్ని తప్పక పాటించాలి" అని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa