ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఎంఐ లపై ఆర్బీఐని సంప్రదించిన రుణ సంస్థలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 04:18 PM

ఈఎంఐపై మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు బకాయిలు చెల్లించడంలో విఫలమైతే, వారి ఫోన్లను దూరం నుంచే లాక్ చేసేందుకు రుణ సంస్థలకు అనుమతి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి. దేశంలో చిన్న మొత్తాల రుణాల ఎగవేతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతోంది. గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అనుసరించిన ఈ విధానాన్ని ఆర్బీఐ గతేడాది నిలిపివేసింది. అయితే, ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి, పటిష్ఠ‌మైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన 'ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్'లో చేర్చనుంది. రాబోయే కొన్ని నెలల్లోనే ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉంది.ఈ కొత్త నిబంధనల ప్రకారం, రుణం ఇచ్చే సమయంలోనే ఫోన్‌ను లాక్ చేసే అవకాశంపై వినియోగదారుడి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే, ఫోన్‌ను లాక్ చేసినప్పటికీ, అందులోని వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే అధికారం రుణ సంస్థలకు ఉండదు. "వినియోగదారుల డేటాకు రక్షణ కల్పిస్తూనే, రుణాల రికవరీకి వీలు కల్పించడమే తమ ఉద్దేశం" అని ఒక అధికారి తెలిపారు.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రూ. లక్షలోపు రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విధానం ద్వారా రికవరీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa