ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్కీ నియామకం మహిళా సాధికారతకు నిదర్శనం: మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:16 PM

నేపాల్‌ నూతన ప్రధానిగా సుశీలా కార్కీ నియామకం మహిళా సాధికారతకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌- నేపాల్‌లు సన్నిహిత దేశాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగు దేశానికి అండగా ఉన్నట్లు చెప్పారు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో నిర్వహించిన సభలో ఈమేరకు ప్రసంగించారు. ‘నేపాల్‌లో శాంతి, స్థిరత్వానికి కార్కీ చొరవ తీసుకుంటారనే విశ్వాసం ఉంది. విపత్కర పరిస్థితుల్లోనూ అక్కడి పౌరులు ప్రజాస్వామ్య విలువలను కాపాడారు’ అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa