నేటి నుంచి అనగా ఆదివారం నుంచి రెండు రోజులు పాటు తిరుపతిలో నిర్వహించనున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు మొదలైంది. పార్లమెంట్ మాత్రమే కాక దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది మహిళా ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ‘వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. తిరుపతి నగరంలోని రాహుల్ కన్వెన్షన్లో రెండు రోజుల పాటు ఈ జాతీయ సదస్సు కొనసాగనుంది.
ఈ సదస్సుల్లో చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులు ఏంటి.. వాటిని అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, దగ్గుబాటి పురందేశ్వరి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ కమిటీ (మహిళా సాధికారత) ఛైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సు అనంతరం వారు చంద్రగిరి కోటను సందర్శించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ సదస్సులో పాల్గొనడం కోసం ఆయన నేడు తిరుపతి రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల చంద్రబాబు పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. అమరావతి-తిరుపతి మధ్య ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో ఏవియేషన్ అధికారులు చంద్రబాబు పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన పర్యటన రద్దయింది. దీంతో ఆయన తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత సదస్సులో పాల్గొనడం లేదు.
తమ ప్రభుత్వం మహిళా సాధికారత సాధించేందుకు అనేక స్కీములు తీసుకొచ్చిందని.. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. బేటీ బచావో-బేటీ పడావో, మహిళా సమ్మాన్ నిధి సహా అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. జాతీయ తొలి మహిళా సాధికారత సదస్సులో పురందేశ్వరి మాట్లాడుతూ.. అనేక మంది మహిళలు సామాజిక అడ్డంకులను అధిగమించి మరీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. అలానే మహిళలు ఏళ్ల నుంచి విద్య, రాజకీయ, ఆర్థిక, సమానత్వం కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa