ఉచిత బస్సు ప్రయాణాల కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలైన ద్వారకాతిరుమల, విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాల్లో మహిళల రద్దీ కనిపిస్తోంది. దూరంగా ఉన్న ఆలయాలతో పాటు వారికి దగ్గరలోని ఆలయాలను సైతం దర్శిస్తూ ఎంత హాయిలే ఇలా అంటూ జోష్తో వెళుతున్నారు. ఈ క్రమంలో ఉభయగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల, మద్దిక్షేత్రం, వాడపల్లి, భీమవరం మావుళ్లమ్మ, పంచారామక్షేత్రాలు, పారిజాతగిరి, అప్పన్నపల్లి, వంటి ఆలయా ల్లోని దేవేరులను దర్శించుకుని మొక్కుబ డులు తీర్చుకుంటున్నారు. ద్వారకాతిరు మలలో దైవదర్శనం అనంతరం ఉచిత భోజన, ప్రసాద సౌకర్యంతో ఆ ప్రాంగణంలో మహిళలతో పోటెత్తుతున్నాయి. బస్సులు సైతం అఽధిక శాతం మంది మహిళలతోనే నిండిపోతున్నాయి. ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు వస్తాయని.. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa