ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్సవాల నిర్వహణ కోసమే ఆ భూములు తీసుకున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 05:01 PM

విజయవాడ ఉత్సవ్ నిర్వహణ కోసమే దేవస్థానం భూములను లీజుకు తీసుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. అది కూడా దేవస్థానానికి భారీ ఆదాయం వచ్చేలా విజయవాడ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. 56 రోజులకు రూ.45లక్షల లీజు మొత్తం స్వామివారి సన్నిధిలో ఇచ్చామని తెలిపారు. తాము వేంకటేశ్వరస్వామి భక్తులమని .. ఎలాంటి తప్పు చేయమని ఉద్ఘాటించారు ఎంపీ కేశినేని శివనాథ్. పార్లమెంట్ సమావేశాలు, ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో కొంత మిస్ కమ్యూనికేషన్ అయిందని చెప్పుకొచ్చారు. మసులా బీచ్ ఫెస్టివల్ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలంతా ఈ ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం వేసవిలో మసులా బీచ్ ఫెస్టివల్.. దసరాకి విజయవాడ ఉత్సవ్ నిర్వహించి తీరుతామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa