ముజఫర్పూర్, బీహార్:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగేలా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని తేజస్వి తేల్చిచెప్పారు. ఇది మహాఘట్బంధన్ కూటమిలో పెద్ద ఎత్తున దుమారం రేపే అవకాశముంది.
కూటమిపై ప్రశ్నార్ధకం:
సీట్ల పంపకాలపై ఇంకా మిత్రపక్షాలతో సంపూర్ణంగా చర్చలు జరగాల్సి ఉన్నదీ, కానీ తేజస్వి ముందస్తు ప్రకటన కూటమి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు రేపింది. గతంలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్షాల మధ్య కూటమిగా ఉన్న మహాఘట్బంధన్ ఇప్పుడు తేజస్వి ఒంటరి పోరాటంతో లోపలి విభేదాలు బయటపడినట్లయ్యింది.
ప్రజల నమ్మకానికి పిలుపు:
ముజఫర్పూర్లోని కాంతి ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తేజస్వి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – "ఈసారి నా ముఖాన్ని చూసి ఓటేయండి," అని అన్నారు. గతంలో లాగా పార్టీ గుర్తులకు మాత్రమే ఓటేయకుండా, నాయకుడిగా తనపై ప్రజలు నమ్మకం ఉంచాలని కోరారు.
ఎన్డీఏపై తీవ్ర విమర్శలు:
తాజా సభలో తేజస్వి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతుందని, వాస్తవిక అభివృద్ధికి దూరంగా ఉందని ధ్వజమెత్తారు. బీహార్లో ఉద్యోగాలు, విద్యా సౌకర్యాలు, వైద్య రంగాల్లో తీవ్ర సమస్యలు నెలకొన్నా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటోందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa