గుంటూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో జనజీవనం స్తంభించిపోయింది. నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆదివారం మధ్యాహ్నం కురిసిన కుంభవృష్టికి నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కాలువలు పొంగిపొర్లడంతో మురుగునీరు, వాననీరు రోడ్లపైకి చేరింది. దీంతో బ్రాడీపేట్, అరండల్ పేట్, శ్రీనగర్, బొంగరలాబీడు వంటి వాణిజ్య, నివాస ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. అనేక చోట్ల వాహనాలు మోకాళ్ల లోతు నీటిలో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా కంకరగుంట రోడ్ అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ప్రధాన కూడళ్లలో వరద నీటి కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇతర పనులపై బయటకు వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. రానున్న గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa