ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై గ్రామస్థుల ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 01:44 PM

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని గోల్లగూడెం గ్రామస్థులు దేవరపల్లి-తల్లాడ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రహదారిపై కీలక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడం, గుంతలు పడడంతో వారానికి సుమారు ఐదు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట విద్యుత్ దీపాలు వెలగకపోవడం, భారీ మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa