ఇంగ్లాండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో అదరగొట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆగస్టు నెలకు గానూ అతడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. ఆగస్టులో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అద్బుత ప్రదర్శనకు గాను హైదరాబాదీ పేసర్కు ఈ అవార్డు దక్కింది.
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్ట్లు సిరాజ్.. అద్భుత ప్రదర్శన చేశాడు. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి టీమిండియాకు సంచలన విజయం అందించాడు. ఈ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 46 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఫైఫర్ నమోదు చేశాడు.
మొత్తంగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా ఐదుకు ఐదు మ్యాచ్లు ఆడాడు. సిరీస్ను 2-2తో భారత్ సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్ 23 వికెట్లు తీసి.. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా చరిత్ర సృష్చించాడు. ఓవరాల్గా 5 టెస్ట్లలో కలిపి అతడు 1000కి పైగా బంతులేశాడు.
ఆగస్టు నెల కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ కోసం.. న్యూజిలాండ్కు చెందిన మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్తో సిరాజ్ పోటీ పడ్డారు. వీరిద్దరిని వెనక్కి నెట్టి తన కెరీర్లో తొలిసారి ఈ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన 9వ ప్లేయర్గా నిలిచాడు. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో మహమ్మద్ సిరాజ్ ఆడనున్నాడు.
ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్న భారత ఆటగాళ్లు..
శుభ్మన్ గిల్ (4 సార్లు)
జస్ప్రీత్ బుమ్రా (2 సార్లు)
శ్రేయస్ అయ్యర్ (2 సార్లు)
రిషభ్ పంత్
రవిచంద్రన్ అశ్విన్
భువనేశ్వర్ కుమార్
విరాట్ కోహ్లీ
యశస్వి జైశ్వాల్
మహమ్మద్ సిరాజ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa