ప్రస్తుతం దేశీయ డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంచలనాలు సృష్టిస్తోంది. 80 శాతానికి పైగా డిజిటల్ పేమెంట్లు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీఐ లిమిట్ క్రమంగా పెంచుతూ వస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మరోసారి ఆ లిమిట్ పెంచింది. అయితే, ఎంపిక చేసిన కేటగిరీలకు మాత్రమే గరిష్ట పేమెంట్లు చేసే అవకాశాన్ని ఇచ్చింది. సవరించిన కొత్త మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్పీసీఐ ఓ ప్రకటన చేసింది.
పన్ను చెల్లింపులకు అనుగుణంగాఉన్న కేటగిరీలలోని సంస్థలకు యూపీఐ పేమెంట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఎన్పీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అంటే వాటికి ఒకేసారి రూ.5 లక్షలు యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. వీటిల్లో ప్రధానంగా ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్, ప్రయాణం, వ్యాపారం సంబంధిత లావాదేవీలకు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపింది. అలాగే 24 గంటల్లో యూపీఐ మొత్తం పేమెంట్ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఒకసారి రూ.5 లక్షలు పంపించవచ్చు. రోజు మొత్తంలో రూ.10 లక్షల వరకు పంపించవచ్చు.
ఈ క్రమంలో భీమ్ యూపీఐ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ ద్వారా అధిక విలువ గల పేమెంట్స్ అంతరాయం లేకుండా చేయవచ్చని తెలిపింది. ఎన్పీసీఐ ట్రాన్సాక్షన్ పరిమితి 24 గంటల్లో రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపింది. ప్రత్యేక కేటగిరీలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా హైవాల్యూ పేమెంట్లు చేయవచ్చని తెలిపింది. మరి ఆ జాబితా తెలుసుకుందాం.
క్యాపిటల్ మార్కెట్స్ (ఇన్వెస్ట్మెంట్స్) కోసం ఒకేసారి రూ.5 లక్షలు, రోజులో రూ.10 లక్షలు పంపవచ్చు.
ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం సింగిల్ పేమెంట్ రూ.5 లక్షలు, 24 గంటల్లో రూ.10 లక్షలు
గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ కోసం సింగిల్ పేమెంట్ రూ.5 లక్షలు, రోజులో రూ.10 లక్షలు
ట్రావెల్ కోసం ఒకేసారి రూ.5 లక్షలు, 24 గంటల్లో మొత్తం రూ.10 లక్షలు
క్రెడిట్ కార్డు పేమెంట్లు అయితే సింగిల్ పేమెంట్ రూ.5 లక్షలు, రోజు మొత్తంలో రూ.6 లక్షల వరకు పంపొచ్చు
కలెక్షన్స్ కోసం అయితే రూ.5 లక్షలు, రూ.10 లక్షలు
జువెలరీ కొనుగోలు కోసం అయితే సింగిల్ పేమెంట్ రూ.5 లక్షలు, 24 గంటల్లో రూ.6 లక్షలు
బిజినెస్, మెర్చంట్ పేమెంట్లు ఒకేసారి రూ.5 లక్షలు మాత్రమే పంపవచ్చు
ఎఫ్ఎక్స్ రిటైల్ వయా బీబీపీఎస్ అయితేరూ.5 లక్షలు, 24 గంటల్లో రూ.5 లక్షలు పంపవచ్చు.
డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ అయితే ఒకేసారి రూ.2 లక్షలు, 24 గంటల్లో సైతం రూ.2 లక్షలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa