రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయని, అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మాత్రమే అధికారాన్ని చలాయిస్తుందని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదని, తెలుగు దేశం ప్రభుత్వం నడుస్తుందన్నారు. దిన దిన జరుగుతున్న పాలన లో బీజేపీ, జన సేన, పాత్ర ఏమి లేదన్నారు. కేవలం టీడీపీ వారు మాత్రమే కూటమి ప్రభుత్వం అంటారు, చేసిన పాపాలు ఇతర పార్టీల పై వేయాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. రెడ్బుక్ పేరుతో వేరోక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనకు మంచి నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో అండగా ఉన్నారని భరోసా కల్పించారు. వైయస్ఆర్సీపీ సమాజంలో ఉండే అట్టడగు వర్గాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం పని చేస్తుందని ధర్మాన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa