ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు దార్శనిక వలనే పెట్టుబడులు రాబట్టగలిగాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 05:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార నిర్వహణ వేగాన్ని (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నామని, దీనికి నిదర్శనంగానే గడిచిన 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సాధించగలిగామని రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక 'భాగస్వామ్య సదస్సు - 2025'కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ - యూకే బిజినెస్ ఫోరం' రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మాకు సుస్థిరమైన, నిరూపితమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆయన అనుభవం ఇప్పుడు నవ్యాంధ్రకు దిక్సూచిగా మారింది" అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa