ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 04:20 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన కుటుంబంపై తమకు ఇప్పటికీ ఎంతో అభిమానం ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరులో ఉడుముల సాంబిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థినుల స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... తన మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు గుంటూరుకు వచ్చానని, అయితే ఈ పర్యటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. "నేను ఏపీకి వస్తున్నానని తెలియగానే జగన్‌ను కలవడానికేనని ప్రచారం మొదలుపెట్టారు. నేను వెంటనే మీడియా ముందు ఆ ప్రచారాన్ని ఖండించాను. నా ప్రతి కదలికపైనా, ప్రతి మాటపైనా చర్చ జరుగుతోంది" అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. "ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులు అనేవారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. వైఎస్సార్ చనిపోయినప్పుడు కన్నీరు పెట్టని కుటుంబం లేదు" అని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa